ప్రముఖ తమిళ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్.. అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రంతో వెండితెరకి పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. తమిళంలో “ఆదిత్య వర్మ” అనే టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు విక్రమ్ ఫ్యామిలీ నుండి మరొకరు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. విక్రమ్ చెల్లెలు అనితా తనయుడు అర్జుమాన్ “పొల్లద ఉలగిల్ బయంగర గేమ్” అనే చిత్రంతో త్వరలో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఆయనకి సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాక్టింగ్పై చాలా ఆసక్తి ఉన్న నేపథ్యంలో అర్జుమాన్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారట విక్రమ్. అర్జుమాన్ డెబ్యూ చిత్రాన్ని విజయ్ శ్రీ.జి తెరకెక్కించనుండగా, జీడీఆర్ ప్రొడక్షన్స్ బేనర్పై నిర్మితం అవుతుంది. బిగ్ బాస్ ఫేం ఐశ్వర్య దత్తా చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. మొట్టై రాజేంద్రన్, జూలీ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్స్ పాత్రలో కనిపించనున్నారట.
previous post
బిగ్బాస్ సీజన్ 4పై నాగార్జున ఎమోషనల్ కామెంట్..