telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

రామ్ గోపాల్ వర్మ పై మరో కేసు .. పిర్యాదు చేసిన పౌరుడు ..

RGV

హైదరాబాద్ పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్ లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై గోపి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరినట్టు మార్ఫింగ్ చేసిన ఫొటోను వర్మ పెట్టారని చెప్పారు. వర్మ తీరుతో అభిమానుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. వర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇటీవలే సోషల్ మీడియాలో వర్మ ఓ మార్ఫింగ్ ఫొటోను వర్మ అప్ లోడ్ చేశారు. చంద్రబాబుకు జగన్ వైసీపీ కండువా కప్పినట్టు ఆ ఫొటోలో ఉంది. ‘ఇప్పుడే చంద్రబాబు వైసీపీలో చేరారు’ అంటూ ట్వీట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో, వర్మపై టీడీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts