telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఆఫ్ఘనిస్తాన్‌లో రోడ్డు పక్కన బాంబు .. పేలిన ఘటన .. బస్సు తునాతునకలు ..28మృతి..

another blast in afghanistan costs 28 lives

మరోసారి ఆఫ్ఘన్ లో బాంబు పేలుడు సంభవించింది. రోడ్డు పక్కన బాంబుపేలిన ఘటనలో బస్సు తునాతునకలైంది. ఈ భారీ బాంబు పేలుడు ధాటికి బస్సులో ప్రయాణిస్తున్న 28 మంది ప్రయాణీకులు చనిపోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వివరించారు. మృతుల్లో మహిళలు, పిల్లఏ ఎక్కువగా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లతో శాంతి చర్చల కోసం అమెరికా దూత కాబూల్‌కు చేరకున్న రోజే ఈ బాంబుదాడి చోటుచేసుకోవడం గమనార్హం.

అమెరికా, ఆఫ్ఘన్‌ దళాలు ఒక వైపు, ఐఎస్‌, తాలిబాన్లు మరో వైపు ఎడా పెడాదాడులు చేస్తుండడంతో పౌరులు, ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దుర్భరంగా మారింది. హేరత్‌, కాందహార్‌ ప్రావిన్షియల్‌ రాజధాను లను కలిపే ప్రధాన రహదారిపై ఫరా ప్రావిన్స్‌లోని అబ్‌ ఖోర్మా ప్రాంతంలో ఈ పేలుడు సంభవించిందని ప్రావిన్షియల్‌ పోలీసు ప్రతినిధి మొహిబుల్లా మొహిబ్‌ చెప్పారు. ఆఫ్ఘన్‌, విదేశీ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందన్నారు.

Related posts