telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్రబాబు సైన్యంలోకి .. మరో ఏడుగురు..

Chandrababu comments Jagan cases
ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో స్పీడ్ పెంచారు. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు తాజాగా తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. శుక్రవారం రాత్రి కాకినాడ పార్లమెంట్‌ పరిధిలోని నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో అభ్యర్థుల విషయమై నిశితంగా చర్చించి అనంతరం జాబితాను ప్రకటించారు. కాగా మెజార్టీ స్థానాల్లో సిట్టింగ్‌ల వైపు చంద్రబాబు మొగ్గు చూపారు.
అభ్యర్థుల జాబితా ఇదే :
కాకినాడ ఎంపీ అభ్యర్థి: చలమలశెట్టి సునీల్
కాకినాడ అర్బన్: వనమాడి కొండబాబు
కాకినాడ రూరల్ : పిల్లి అనంతలక్ష్మీ
పెద్దాపురం: చినరాజప్ప
తుని : యనమల కృష్ణుడు
జగ్గంపేట: జ్యోతుల నెహ్రు
పత్తిపాడు : వరుపుల రాజా
పిఠాపురం : పెండింగ్‌లో ఉంది. 
కాగా ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీ తరఫున గెలుపొందారు. కాగా శుక్రవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్న సునీల్‌కు కాకినాడ ఎంపీ సీటు ఇచ్చారు.

Related posts