తమిళనాడుకు చెందిన అన్నామలై యూనివర్సిటీ 2019-20 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజి కోర్సుల్లో చేరడానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని సంస్థ డైరెక్టర్ వీరబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లమో, పీజీ డిప్లమో, బీఎల్ఐసీ, ఎంఎల్ఐసీ, బీసీఎ, ఎంసీఎ, ఎల్ఎల్బీతో పాటు యోగా కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది నుంచి బీఈడీ, పీహెచ్డి, బీ ఫార్మా, డీ ఫార్మా, కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. చెన్నై అన్న్నామలై నగర్లో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్లో పీసీబీ కోర్సుల్లో భాగంగా ప్రత్యేక యోగా కోర్సుకు ఈ నెల 15వ తేదీతో గడువు ముగుస్తుందని వివరించారు డిగ్రీ మధ్యలో ఆపేసిన విద్యార్థులకు ఒన్ సిటింగ్ ద్వారా పూర్తి చేసే అవకాశాన్ని కల్పించామని తెలిపారు. ఆసక్తి గల వారు 9133090105లో సంప్రదించాలని సూచించారు.