తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రంలో అనుష్క నటించనుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. “కల్కి” రచించిన “పొన్నియన్ సెల్వన్” పుస్తకం ఆధారంగా దర్శకుడు మణిరత్నం ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. తమిళంతోపాటు పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించబోతున్నారు.
అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, విక్రమ్, విజయ్ సేతుపతి, జయం రవి, కీర్తి సురేష్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు నయనతారను కూడా తీసుకున్నారు. అయితే ఆమె ప్రస్తుతం రజినీకాంత్, విజయ్ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల డేట్స్ అడ్జెస్ట్ కాలేదు. అందువల్ల ఆమె స్థానంలో అనుష్కను తీసుకున్నట్టు సమాచారం. నిజానికి నయనతార కంటే ముందు అనుష్కకే ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అప్పుడు అనుష్క ఆ ఆఫర్ను తిరస్కరించింది. దాంతో నయనతారను తీసుకున్నారు. ఇప్పుడు నయనతార తప్పుకోవడంతో ఆ ఆఫర్ మళ్లీ అనుష్కను వరించింది. ఇప్పుడు అనుష్క సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.