పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాల సక్సెస్తో టాలీవుడ్ లో మంచి ఫామ్లో ఉన్న దర్శకుడు అనీల్ రావిపూడి. ఇప్పుడు మహేష్ బాబుతో అనిల్ రావిపూడి సినిమాను పట్టాలెక్కించనున్నాడు. “మహర్షి” సినిమా విడుదల తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి చిత్రంలో మహేష్ పాత్ర పేరు అజయ్ జోసఫ్ అని, సినిమా టైటిల్ “సరిలేరు నీకెవ్వరు” అని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు క్యారక్టరైజేషన్ హైలెట్ గా నిలుస్తుందట. ఇక ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషించనున్నారు. శ్రీమంతుడు చిత్రంలో మహేశ్కు తండ్రిగా నటించిన జగపతిబాబు ఈ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. మహేష్ 26వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న, అదితి రావు హైదరి చిత్రంలో కథానాయికలుగా నటించనున్నట్టు తెలుస్తుంది. 2020లో విడుదల కానున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
previous post