telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు: మంత్రి అనిల్ యాదవ్

minister anil kumar

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. అమరావతిలో అక్రమాలు జరగకపోతే, చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి భూకుంభకోణంపై ఏపీ ప్రభుత్వం ఏసీబీ కేసును నమోదుచేసిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ కుంభకోణంపై సీబీఐ విచారణను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు.

సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు సహకరిస్తామని చంద్రబాబు లేఖ రాయగలరా? అని ప్రశ్నించారు. ఫైబర్ గ్రిడ్ లో సైతం భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది పంటలు పండాయని చెప్పారు. రైతుల కోసం ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిందని అన్నారు.

Related posts