తాజాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవి నుంచి అనిల్ అంబానీ వైదొలిగారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన అతన్ని ఈ కంపెనీ నుంచి రక్షించలేక ఆయన చేతులెత్తిసిన విషయం తెలిసిందే. కేవలం అనిల్ అంబానీ మాత్రమే కాదు అతనితో పాటు ఛాయా విరాణి, రైనా కరానీ, మంజరి కకేర్, సురేష్ రంగాచారీలు డైరెక్టర్లుగా వైదొలిగారు.
గతంలో కంపెనీ డైరెక్టర్, సీఎఫ్ఓ వి.మణికంఠన్ రాజీనామా చేశారని, వీరి రాజీనామాలను కంపెనీ రుణదాతల కమిటీకి నివేదిస్తామని ఆర్కామ్ తెలిపింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బీఎస్ఈకి ఇచ్చిన నోటీసులో ఈ అంశాన్ని తెలియజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టాలు రూ.30,142 కోట్లకు చేరిన విషయం అందరికి తెలిసిందే.
ప్రధాని పర్యటనకు రాకపోవడం దారుణం: పురంధేశ్వరీ