telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆనందయ్య మందు పంపిణీ పై విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్…

ఆనంద‌య్య క‌రోనా మందు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో రెండు హౌస్ మోష‌న్ పిటిష‌న్లు దాఖ‌లు అయ్యాయి.. అయితే, ఆ రెండు పిటిషన్ల విచారణకు హైకోర్టు అనుమ‌తించింది.. ఈ నెల 27న విచారణ చేపట్టనుంది హైకోర్టు డివిజన్ బెంచ్.. కాగా, ప్రభుత్వం మందు పంపిణీకి ఖర్చులు, ఇతర సౌకర్యాలు కల్పించాల‌ని కోరారు పిటిషనర్లు, శాంతి భద్రతల సమస్య లేకుండా చూడాల‌ని.. లోకాయుక్తా ఆదేశాల ప్రకారం మందు పంపిణి అపారని పోలీసులు చెబుతున్నారని లోకాయుక్తకి ఆ అధికారం లేద‌ని పిటిష‌న్ల‌లో పేర్కొన్నారు.. మందు పంపిణీ ఆపాలని అసలు లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేద‌ని తెలిపారు.. ఏ ఆదేశాలు లేకుండా ఆపటం స‌రికాద‌.ఇ.. ఆర్డర్ ఇవ్వకుండా ఆనంద‌య్య‌ను ఆపటం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింద‌న్నారు పిటిష‌న్లు.. మొత్తానికి ఆ రెండు పిటిష‌న్ల‌ను విచార‌ణ‌కు అనుమ‌తి ఇచ్చింది హైకోర్టు.. మ‌రి కోర్టులో వాద‌న‌లు ఎలా జ‌ర‌గ‌నున్నాయి.. ఎలాంటి నిర్ణ‌యం రానుంది అనేది తెలియాల్సి ఉంది. 

Related posts