telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో సెప్టెంబరు 5 నుంచి స్కూల్స్ రీఓపెన్!

school students

పాఠశాలల పునఃప్రారంభానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుటోంది. సెప్టెంబరు 5 నుంచి బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేసింది. బీహార్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఆగస్టులో స్కూళ్లు తిరిగి తెరవనున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటి వరకు స్కూళ్ళ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

స్కూల్స్ సురక్షిత ప్రణాళికపై ఈ నెల 15న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ చెప్పాలని ఈ సందర్భంగా కోరింది. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలు తమ ప్రణాళికలను వివరించారు. వీటిలో ఏవైనా మార్పులు ఉంటే చెప్పాలని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభిస్తామని తెలిపిన ఏపీ సర్కారు. ఇప్పుడు సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలను ప్రారంభించనున్నట్టు పేర్కొంది.

Related posts