telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ సర్కారుపై కేంద్ర జలశక్తి మండలి సీరియస్

jagan

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌ విషయంలో ఏపీ ప్రభుత్వంపై కేంద్రం మరోసారి సీరియస్ అయింది. ప్రాజెక్టుకు సంబంధించిన పరిణామాలపై నివేదిక ఇవ్వాలంటూ రెండు వారాల క్రితం జగన్ సర్కారుకు ప్రధానమంత్రి కార్యాలయం లేఖ రాసింది. రివర్స్ టెండరింగ్‌పై  ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లడంతో కేంద్రం వివరణ కోరింది. రివర్స్ టెండరింగ్ ‌కు వెళ్లాలన్న నిర్ణయం వెనక ఉన్న కారణం చెప్పాలని కోరింది.

కేంద్రం రాసిన లేఖపై ఏపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో కేంద్ర జలశక్తి మండలి సీరియస్ అయింది. పీఎంవో రాసిన లేఖపై రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు తాజాగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఓపీ సిన్హా లేఖ రాశారు.

Related posts