telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అదనపు పన్ను వసూలుకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు!

liquor shops ap

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ కి తెచ్చుకునే మద్యంపై అదనపు పన్ను వసూలు చేయాలని ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గతంలో ప్రతి వ్యక్తి వద్దా మూడు సీసాల వరకూ నిల్వ ఉంచుకునేందుకు అనుమతులు అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న వారిలో అత్యధికులు మూడేసి సీసాల చొప్పున మద్యం తెచ్చుకుంటున్నారు. వీరిపై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో, కేసులు పెట్టగా, ప్రభుత్వమే గరిష్ఠంగా మూడు మద్యం సీసాలను ఉంచుకోవచ్చని స్పష్టం చేసింది. గతంలో ఓ కేసును విచారించిన ధర్మాసనం, ఎక్కడ కొనుగోలు చేసైనా పౌరులు మూడు సీసాలను తెచ్చుకోవచ్చని తేల్చింది.

ఈ తీర్పు తరువాత, ఇతర రాష్ట్రాల నుంచి స్వల్ప మొత్తంలో మద్యం తీసుకుని ఏపీకి వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరకు మద్యం కొని, ఇళ్లల్లో నిల్వ ఉంచుకుని, వ్యాపారం సాగిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిందని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. దీంతో మూడు సీసాల నిబంధనను మారుస్తూ చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts