telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీఎస్ ఆర్టీసీ అడ్వాన్స్ టికెట్ల బుక్.. రిఫండ్ చేస్తున్న అధికారులు

apsrtc bus

ఈ నెల 16వ తేదీ నుంచి లాక్ డౌన్ ను తొలగిస్తారన్న ఆలోచనతో చాలా మంది ప్రయాణాలకు సిద్దమయ్యారు. ఈ నెల తొలి వారంలో ఆన్ లైన్ లో అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకున్నారు. జారీ చేసిన అడ్వాన్స్ టికెట్లకు సంబంధించిన రుసుమును ప్రయాణికులకు రిఫండ్ చేయడం ప్రారంభించామని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. 16 నుంచి ప్రయాణాలకు అనుమతిస్తారన్న ఉద్దేశంతో ఏటీబీ ఏజంట్ల ద్వారా, ఆర్టీసీ బస్టాండ్లలోని రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా కూడా వేలాది మంది టికెట్లను బుక్ చేసుకున్నారు.

లాక్ డౌన్ ను మే 3 వరకూ పొడిగించిన నేపథ్యంలో బస్సులన్నింటినీ రద్దు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆన్ లైన్ లో టికెట్లు పొందిన వారి ఖాతాల్లోకి నేరుగా ఆ రిఫండ్ డబ్బును జమ చేస్తున్నామని, ఆర్టీసీ బస్టాండ్లలో, ఏజంట్ల నుంచి పొందిన టికెట్లను ప్రయాణికులు స్వయంగా రద్దు చేసుకుని పూర్తి నగదును వాపసు పొందవచ్చని వెల్లడించారు.

Related posts