telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విలేకరిని హత్య చేయడం ఘోరం: కన్నా

Kanna laxminarayana

తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలం ఎస్‌ అన్నవరంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కాతా సత్యనారాయణను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సత్యనారాయణ హత్య  దారుణ, హేయమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాంటి వ్యక్తి పాత్రికేయుడని… అలాంటి పాత్రికేయుడిని పాశవికంగా హత్య చేయడం చాలా ఘోరమని అన్నారు. హంతకులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని విమర్శించారు. సత్యనారాయణ కుటుంబసభ్యులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు.

Related posts