telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా ఎఫెక్ట్… రిస్క్ చేయలేమంటున్న స్టార్ యాంకర్లు…?

Anasuya

ప్రస్తుతం టీవీ పరిశ్రమలోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో కొద్దిరోజులపాటు షూటింగ్‌లకు సెలవు చెప్పాలని ఈ స్టార్ యాంకర్లు సుమ, అనసూయ నిర్ణయం తీసుకున్నారట. సినిమా, టీవీ షూటింగ్‌లకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌లు జరుపుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి. దీంతో జూన్ రెండో వారం నుంచి సినిమా, టీవీ షూటింగ్‌లు తిరిగి మొదలయ్యాయి. అయితే, టీవీ పరిశ్రమలోని పలువురు నటీనటులు కరోనా పాజిటివ్ రావడంతో భయాందోళన మొదలైంది. టీవీ పరిశ్రమలో కరోనా మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి కొన్ని ఛానెళ్లు షూటింగ్‌లను తాత్కాలికంగా ఆపివేశాయి. అయితే, కొన్ని షోలు, సీరియల్స్ షూటింగ్‌లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్‌లు కొనసాగిస్తున్న వాటిలో సుమ ‘క్యాష్’, అనసూయ ‘జబర్దస్త్’ కూడా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ తమ షోల షూటింగుల్లో పాల్గొంటున్నారు. అయితే కొద్ది రోజులపాటు ఈ షూటింగ్‌లకు దూరంగా ఉండాలని సుమ, అనసూయ నిర్ణయం తీసుకున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రిస్క్ తీసుకోవడం అనవసరమని భావించిన ఈ యాంకర్లు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారట. నిజానికి లాక్‌డౌన్ సమయంలోనే షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని అనసూయ మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఇంట్లో కూర్చోవడం వల్ల టీవీ పరిశ్రమలో తనతో సహా ఎంతో మంది ఉపాధిని కోల్పోతున్నామని.. ఆదాయం లేకపోతే ఈఎంఐలు కట్టుకోలేమని రిక్వెస్ట్ చేశారు. అలాంటిది ఇప్పుడు షూటింగ్‌లు స్టార్ట్ అయిన తరవాత అనసూయ ఇలా మానేయడం ఏంటో… మరి ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఈ రూమర్ ఎంత వరకు నిజమో చూడాలి.

Related posts