telugu navyamedia
వార్తలు సామాజిక సినిమా వార్తలు

అసత్య వార్తలు నమ్మి ఫోన్లు చేయొద్దు: యాంకర్ ఝాన్సీ

Anchor Jhansi news

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అల్లాడిస్తున్న నేపథ్యంలో ఫేక్‌న్యూస్‌ కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలకు కరోనా సోకిందని నకిలీ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సినీ, టీవీ ప‌రిశ్ర‌మ‌ల్లోనూ కొందరికి క‌రోనా సోకిన విషయం తెలిసిందే. అయితే, ఇదే అదునుగా చూసుకుని కరోనా సోకని వారికి కూడా సోకిందంటూ నకిలీ వార్తలు ప్రచారం అవుతున్నాయి.

యాంకర్ ఝాన్సీకి క‌రోనా సోకిందని ఇటీవల ప్రచారం జరిగింది.హోస్ట్‌గా ఉన్న పరివార్ సీజన్ 2 కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో కరోనా ఉన్న వారితో కలిసి పని చేయడం వల్ల ఆమెకు కూడా వైరస్‌ సోకిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఝాన్సీ స్పందించారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని తెలిపారు. అసత్య వార్తలు నమ్మి తనకు ఫోన్లు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన వా‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Related posts