బుల్లితెరపై యాంకర్గా, వెండితెరపై నటిగా దూసుకెళ్తోంది అనసూయ భరద్వాజ్. తన గ్లామర్ తో యూత్ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది ఈ బ్యూటీ. అనసూయ సోషల్ మీడియా ద్వారా తన ప్రాజెక్టులతో పాటు పర్సనల్ విషయాలని కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా తన మొదటి బాయ్ ఫ్రెండ్ ఎవరనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. తాజాగా అభిమానులతో ముచ్చటించిన అనసూయకి ఓ నెటిజన్ నుండి మీ మొదటి బాయ్ ఫ్రెండ్ ఎవరని అడగగా, అందుకు అనసూయ నా భర్త సుశాంక్ భరద్వాజ్ అని చెప్పుకొచ్చింది. మొదటి, రెండు, మూడు .. ఇలా ఇప్పటికీ ఎప్పటికీ అతనే నా బాయ్ ఫ్రెండ్ అని సమాధానం ఇచ్చింది. అంతేకాదు తమ త్యోబ్యాక్ పిక్ కూడా షేర్ చేసింది. ఇక మరో ప్రశ్నకి తమ 5వ యానివర్సరీ ఇటలీలో జరుపుకోవాలని భావించినట్టు చెప్పుకొచ్చింది. కాని లాక్డౌన్ వలన వాటిని విరమించుకున్నాం అని పేర్కొంది. అనసూయ, సుశాంక్లు 12వ తరగతి సమయంలో ఎన్సిసి శిబిరంలో మొదట కలుసుకున్నట్లు, తమ కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి కొంత సమయం పట్టిందని . అనసూయ ప్రేమ వివాహం చేసుకోవటానికి తన తండ్రితో కూడా గొడవపడిందని సమాచారంఇటీవలే వెల్లడించింది అనసూయ. కాగా అనసూయ – సుశాంక్ దంపతులకి ఇద్దరు కుమారులు. వారి పేర్లు శౌర్య, అయాన్ష్ భరద్వాజ్.
previous post