ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. గంథపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా విడుదలకానుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ లుక్ పరంగా ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప సెట్ నుంచి ఆమె ఫొటోలు కొన్ని లీక్ అయ్యాయి. ఈ ఫొటోను బట్టి ఈ సినిమాలో అనసూయ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు యాసలో డైలాగ్స్ ఉండనున్నట్లు వినికిడి.
కాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో సునీల్ భార్యగా అనసూయ నటించబోతుందని టాక్. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా పుష్ప ఫస్ట్ పార్ట్ను రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
టిక్కెట్ రేట్లపై ప్రభుత్వానికి చెప్పాల్సింది చెప్పా..ఇకపై