telugu navyamedia
సినిమా వార్తలు

అనసూయ “కథనం” ట్రైలర్

Kathanam

ది గాయత్రి ఫిలిమ్స్ మరియు ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం’. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించగా.. బి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 9న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అనసూయ మాట్లాడుతూ.. “నాగార్జున‌గారు నా అభిమాన హీరో. ఆయన సినిమా పోస్టర్ (మన్మథుడు 2), నా సినిమా పోస్టర్ ఒకే రిలీజ్ టైమ్‌కి చూస్తాననుకోలేదు. ఇది ఆయనతో పోటీ పడటం కాదు.. పైగా రెండు చిత్రాలు వేర్వేరు జానర్స్. డబ్బుతో ముడిపెట్టి పెద్ద సినిమా, చిన్న సినిమా అనడం సరికాదు. ప్రేక్షకులకు నచ్చిందే పెద్ద సినిమా, నచ్చకపోతే అది సినిమానే కాదు. ధనరాజ్ వల్లే ఈ చిత్రంలో నటించాను. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో పాట ఒక్కటే. రోషన్ చక్కని నేపథ్య సంగీతం అందించాడు. సతీష్ కెమెరా వర్క్ నాలో కాన్ఫిడెన్స్ నింపింది. సినిమా మెప్పిస్తుందనే నమ్మకముంది” అని చెప్పారు.

Related posts