కరోనా మహమ్మారి బారిన పడి ఎంతో మంది వైద్యులు, పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే. అదే కరోనా వైరస్ కారణంగా ఓ యువ జర్నలిస్టు మనోజ్ కుమార్ మృతి చెందడంతో ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మనోజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలో అనసూయ స్పందిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. కరోనా పై పోరాటంలో డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులు కూడా నిరంతరం శ్రమిస్తున్నారని, ఆ పోరాటంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. వార్తలను చేరవేస్తున్నారని గుర్తు చేస్తూనే.. ఈ క్రమంలో మనోజ్ కుమార్ అనే యువ జర్నలిస్టు మృతి తనకు బాగా కలిచివేసిందన్నారు అనసూయ. అంతేకాదు ‘ఎంతో మంది జర్నలిస్టులు తమ వృత్తిలో భాగంగా కరోనాపై పోరాడుతున్నారు. మీరందరూ కూడా కరోనా విషయంలో చాలా జాగ్రత్తలు పాటించడం, దయచేసి జాగ్రత్తగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు అనసూయ.
previous post