ఇటీవల అత్త పాత్రలో అలరించి, అందరిని మెప్పించిన అనసూయ మరో భారీ చిత్రంలో కనిపిస్తుంది. అదే వై.ఎస్.ఆర్ జీవితంపై నిర్మిస్తున్న యాత్ర. ఈ చిత్రంలో అనసూయ ఎమ్మెల్యే గా కనిపిస్తుందని తెలుస్తుంది. ఒకపక్క బుల్లితెర ప్రేక్షకులను మరోపక్క వెండితెరపై మెరుస్తున్న అనసూయ పాత్రపై అభిమానులు ఆసక్తి చూపడం విశేషం. అలాంటి అనసూయన ‘యాత్ర’ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా రూపొందిన ఈ సినిమాలో అనసూయ ఎవరి పాత్రలో కనిపించనుందనే విషయంపై అభిమానులు ఆసక్తిని కనబరుస్తూ వచ్చారు. ఈ సినిమాలో ఆమె ఎమ్మెల్యే గా కనిపించనుందనేది తాజా సమాచారం.
ఎమ్మెల్యే ‘గౌరు చరితా రెడ్డి’ పాత్రలో అనసూయ కనిపించనుందని అంటున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున నందికొట్కూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి చరితా రెడ్డి ఏ విధంగా గెలిచారు? .. అప్పటి పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొన్నారు? కాంగ్రెస్ పార్టిం కోసం ఆమె చేసిన కృషి .. మొదలైన విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారట. వైఎస్ పాత్రలో మమ్ముట్టి .. ఆయన తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు.