గుప్త నిధుల కోసం దుండగులు గుడిలోని విగ్రహ మండపాన్నే తవ్వేశారు. ఆశ్చర్యపరిచే ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కళ్యాణ దుర్గం మండలం తూర్పు కోడిపల్లిలో శ్రీకృష్ణాలయం ఉంది. ఈ ఆయంలో ప్రతిష్ఠించిన కృష్ణుని విగ్రహం కింద గుప్త నిధులు ఉన్నాయన్నప్రచారం స్థానికంగా ఉంది.
ఈ నమ్మకంతో కొందరు దుండగులు నిధులపై కన్నేశారు. గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించారు. గుప్త నిధుల కోసం విగ్రహం కింది భాగంలో పెకిలించే యత్నం చేస్తుండగా.. గ్రామస్తుల రాకతో దుండగులు పరారయ్యారు.