telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

గుప్త నిధుల కోసం గుడిలో చోరీ.. విగ్రహం తొలగించే యత్నం

New couples attack SR Nagar

గుప్త నిధుల కోసం దుండగులు గుడిలోని విగ్రహ మండపాన్నే తవ్వేశారు. ఆశ్చర్యపరిచే ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కళ్యాణ దుర్గం మండలం తూర్పు కోడిపల్లిలో శ్రీకృష్ణాలయం ఉంది. ఈ ఆయంలో ప్రతిష్ఠించిన కృష్ణుని విగ్రహం కింద గుప్త నిధులు ఉన్నాయన్నప్రచారం స్థానికంగా ఉంది.

ఈ నమ్మకంతో కొందరు దుండగులు నిధులపై కన్నేశారు. గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించారు. గుప్త నిధుల కోసం విగ్రహం కింది భాగంలో పెకిలించే యత్నం చేస్తుండగా.. గ్రామస్తుల రాకతో దుండగులు పరారయ్యారు.

Related posts