telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

పెళ్లయిన పది నిమిషాలకే వరుడు పరార్!

marriage

వధువు మెడలో మూడుముళ్లు వేసిన పది నిమిషాలకే వరుడు పరారయ్యాడు. అనంతపురం జిల్లాలోని కదిరి మండలంలో ఈ ఘటన జరిగింది. తలుపుల మండలంలోని ఓబులరెడ్డిపల్లికి చెందిన చిన్నా అనే యువకుడికి కదిరికి చెందిన తన అక్క కుమార్తెతో వివాహం నిశ్చయమైంది.

నిన్న ఉదయం ముత్యాలచెరువు పంచాయతీ పరిధిలోని పాలబావి సాసవల చిన్నమ్మ ఆలయం వద్ద వీరి వివాహం జరిగింది. పెళ్లి కుమార్తెకు తల్లిదండ్రులు, వరుడికి తండ్రి లేకపోవడంతో ఇరు కుటుంబాలకు చెందిన బంధువులే వీరి వివాహాన్ని జరిపించారు.

పెళ్లి సందర్భంగా మూడు తులాల బంగారం పెడతామని మాటిచ్చిన వధువు బంధువులు డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో బంగారం పెట్టలేకపోయారు. దీంతో కినుక వహించిన వరుడు చిన్నా వధువు మెడలో తాళి కట్టిన పది నిమిషాలకే అక్కడి నుంచి పరారయ్యాడు. తనకు తన వాళ్లు బలవంతంగా వివాహం జరిపించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Related posts