ఐ, 2.0 లాంటి భారీ సినిమాల్లో నటించిన గ్లామర్ డాల్ అమీ జాక్సన్ స్వయంగా తాను గర్భవతిని అని ప్రకటించేసింది. ఈ హాట్ బ్యూటీ గత కొన్ని రోజులుగా మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయిటౌతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే జార్జ్ తో అమీ ఎంగేజ్మెంట్ జరిగింది. జార్జ్ తో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అక్టోబర్ లో తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట 2019 జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జార్జ్ బ్రిటన్ కు చెందిన ఓ కుబేరుడు. హిల్టన్, పార్క్ ప్లాజా, డబుల్ ట్రీ లాంటి లగ్జరీ హోటల్స్ ను నిర్వహిస్తున్నాడు జార్జ్. ఇక అమీ జాక్సన్ విషయానికొస్తే “మద్రాసు పట్టణం” చిత్రంతో సినిమాల్లోకి తెరంగ్రేటం చేసింది. తరువాత హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటించింది అమీ. చివరిగా సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన “2.0” చిత్రంలో నటించింది అమీ. ఇటీవలే అమీ “బేబీ బాయ్ కి జన్మనివ్వబోతున్నాను” అని క్యాప్షన్ పెట్టి షాక్ ఇచ్చింది. తాజాగా బేబి షవర్ పార్టీకి సంబంధించిన ఫోటోలని అమీ జాక్సన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇందులో థీమ్కి తగ్గట్టు బ్లూ-ఆఫ్ షోల్డర్ డ్రెస్ ధరించిన అమీ జాక్సన్ నవ్వులు చిందిస్తుంది. పార్టీ ప్రదేశం పూర్తిగా పువ్వులు మరియు బెలూన్లతో పాటు తీపి విందులతో కూడిన పేస్ట్రీ టేబుల్ తో ఉంది. అమీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. తనకి పుట్టబోయే కుమారుడు చాలా అదృష్టవంతుడని చెప్పుకొచ్చిన అమీ, ఆ శిశువు జీవితంలో ఎందరో మహిళలు ఉన్నారని పోస్ట్కి కామెంట్గా రాసింది. ఇక ఈ జంట 2020లో గ్రీస్ వేదికగా పెళ్లి పీటలు ఎక్కనున్నారు. బీచ్ సైడ్ వెడ్డింగ్గా వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తుంది.