telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజమౌళి చేతులమీదుగా ‘అమృతం ద్వితీయం’ ట్రైలర్

amrutam

బుల్లితెరపై సంచలనం సృష్టించిన ‘అమృతం’ తెలుగు ప్రేక్షకులను మరింతగా అలరించడానికి మళ్లీ రానుంది. తాజాగా ‘అమృతం ద్వితీయం’ ట్రైలర్ దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘అమృతం’ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ట్వీట్ చేశారు రాజమౌళి. ఈ జెనరేషన్‌కు తగ్గట్టు చక్కటి కథా కథనాలతో, అదిరిపోయే కామెడీతో ‘అమృతం ద్వితీయం’ తెరకెక్కుతోంది. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. హర్షవర్ధన్, శివన్నారాయణ, వాసు ఇంటూరి, రాగిణి పూర్వ పాత్రలే పోషించగా, L.B శ్రీరామ్ అంజి పాత్రలో, సత్య క్రిష్ణ అమృతం భార్య సంజీవిని పాత్రలో కనబడనున్నారు. ఉగాది కానుకగా మార్చి 25 నుంచి జీ5 లో ‘అమృతం ద్వితీయం’ ప్రసారం కానుంది.

Related posts