telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

అమృతకు నా ఆస్తిలో హక్కు లేదు.. మారుతీరావు వీలునామా!

amrutha maruthi rao

తన ఏకైక కుమార్తె అమృత వర్షిణి, తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న తీవ్ర ఆగ్రహంతో అమృత భర్త ప్రణయ్ ను మారుతి రావు కోటి రూపాయల సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. అప్పట్లో ఈ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచనం రేపింది. ఈ కేసులో జైల్ కు వెళ్ళిన మారుతీరావు ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చాడు. తన కుమార్తె అమృత కు నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కరాదన్న ఉద్దేశంతో వీలునామా రాశారు. ఆమెకు తన ఆస్తిలో వాటా లేదని, తన స్వార్జితమైన ఆస్తులపై ఆమెకు హక్కు లేదని స్పష్టం చేశారు.మారుతీరావు వీలునామా రాసిన విషయాన్ని పోలీసులు తమ చార్జ్ షీట్ లో పొందుపరిచారు.

దాదాపు 9 నెలల పాటు ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు సాగగా, తన ఏకైక కుమార్తె అమృత వర్షిణి, తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో, అతనిపై కోపం పెంచుకుని హత్య చేయించాడని పోలీసులు తేల్చారు. ప్రణయ్ తో తాను తీసుకున్న వీడియోలను అమృత బంధుమిత్రులకు షేర్ చేయడం మారుతీరావు తట్టుకోలేకపోయారు. ఈ విషయమై అందరూ తనను ప్రశ్నిస్తుంటే ఆగ్రహం తట్టుకోలేక ఈ హత్యకు పథకం రూపొందించినట్టు పేర్కొన్నారు.

Related posts