ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు నిన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన తండ్రిని కడసారిగా చూడాలని కుమార్తె అమృత పేర్కొంది. అందుకు పోలీసుల సహకారం కావాలని ఆమె అమృత కోరింది. ఈ మేరకు ఆమె మిర్యాలగూడ అధికారులకు సమాచారాన్ని పంపింది. తన తండ్రిని చూడాలని భావిస్తున్నానని, అక్కడికి వెళితే, తనపై దాడి జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భద్రత కల్పించాలని ఆమె కోరడంతో పోలీసులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అమృత రావాలని అనుకుంటున్న విషయాన్ని మారుతీరావు దగ్గరి బంధువులకు తెలియజేస్తామని, వారి అభిప్రాయం తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. తండ్రి అంత్యక్రియలకు వస్తానని అమృత చేసిన విజ్ఞప్తిపై ఇప్పటివరకూ ఆమె తల్లి స్పందించలేదని తెలుస్తోంది. తన కుటుంబం ఇలా కావడానికి కారణం అమృతేనన్న ఆగ్రహంతో ఆమె ఉన్నట్టు కొందరు బంధువులు అంటున్నారు.
మండలికి ఎవరు తాగొచ్చారు.. యనమల వ్యాఖ్యలపై బొత్స ఫైర్