ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మారుస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అమ్మ ఒడి పథకంపై ఏపీ సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు అందజేస్తామని తెలిపింది.
పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా అందరికీ అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని వివరించింది. పేద పిల్లలు చదివేది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలైనా అమ్మ ఒడి వర్తిస్తుంది. పేదల పిల్లలు ప్రతి ఒక్కరు చదువుకోవాలన్న ఉద్దేశంతోనే పథకం అమలు చేస్తామని పేర్కొంది. అమ్మ ఒడి పథకంలో ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావులేదని స్పష్టం చేసింది.