telugu navyamedia
రాజకీయ వార్తలు

కొత్త సీఎం కు .. అభినందనలు తెలిపిన అమిత్ షా.. 29న బలపరీక్ష..

modi honored in amitsha feast

బీజేపీ నేత యడ్యూరప్ప కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సీఎం సభలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న బలపరీక్షకు యడ్యూరప్ప సిద్ధమయ్యారు. బలపరీక్ష అనంతరం మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. ఆ తర్వాత సభలో ఆర్థిక బిల్లు ప్రవేశపెడతారని సమాచారం.

కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొత్త సీఎం యడ్యూరప్పకు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో యడ్యూరప్ప నాయకత్వంలో రాష్ట్రంలో స్థిరమైన పాలన సాగిస్తామని అన్నారు. రైతు అనుకూల, అభివృద్ధిదాయక ప్రభుత్వాన్ని అందిస్తామని కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తున్నానని చెబుతూ అమిత్ షా తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Related posts