బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కోవిడ్ 19 బారిన పడిన సంగతి తెలిసిందే. ముంబైలోని నానావతి హాస్పిటల్లో వీరు చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అమితాబ్ గురువారం రాత్రి ట్విట్టర్ ద్వారా స్పందించారు. తను, తన కుమారుడు అభిషేక్ ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థనలు చేసిన వారికి అమితాబ్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ మా ఆరోగ్యం కోసం చూపిన ప్రేమ, ఆశీర్వాదాలు, ప్రార్థనలన్నింటినీ చూశాను. మీ హద్దులు లేని అభిమానానికి నా కృతజ్ఞతలు. హాస్పిటల్లో నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. ఇనవ్నీ మా ఆరోగ్యం కోసమే. కాబట్టి నేను ఇంత కంటే ఏమీ చెప్పలేను. ప్రేమతో…’’ అంటూ అమితాబ్ పోస్ట్ చేశారు.
T 3596 –
I receive all your blessings and love and prayers for our well being .. on sms, on whatsapp, on insta on Blog .. and all possible social media ..
my gratitude has no bounds ..
Hospital protocol is restrictive, i cannot say more .. Love 🙏❤️— Amitabh Bachchan (@SrBachchan) July 16, 2020