బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు ఉత్తరాదిలోనే కాదు దక్షిణాదిలోనూ భారీ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కు తగ్గట్లుగానే అమితాబ్ ఒకవైపు సినిమాలు, మరోవైపు ప్రకటనల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. తాజాగా ఈ సంవత్సరానికి గానూ అమితాబ్ కట్టిన పన్ను వివరాలను ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి అమితాబ్ రూ.70 కోట్లను ఐటీ శాఖకు పన్నుగా చెల్లించినట్లు ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు అమితాబ్ ముజఫర్ నగర్ లో అప్పుల్లో కూరుకుపోయిన 2,084 మంది రైతుల రుణాలను చెల్లించడమే కాకుండా ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున విరాళంగా ఇచ్చారు. దీంతో బిగ్ బీ సంపాదనలోనే కాదు సాయమందించడంలో కూడా ముందే ఉంటారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ బ్రహ్మాస్త్ర, సైరా వంటి సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలోనే కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు.
previous post