బాలీవుడ్ మెగాస్టార్ 77 ఏళ్ళ వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఇప్పటికీ భారీ క్రేజ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అమితాబ్. ఒక్క బాలీవుడ్ లోనే కాదు తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఏ భాషలోనైనా నటించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. 200కి పైగా చిత్రాల్లో నటించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. సినీ పరిశ్రమకు చేసిన విశిష్ట సేవలు చేసిన ఈ అరుదైన నటుడికి ఇటీవలే ప్రతిష్ఠాత్మక “దాదాసాహెబ్ ఫాల్కే” అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్ ఇటీవల 77వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన పుట్టిన రోజు వేడుకలని కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా జరిపారు. ఏడు పదుల వయస్సులోను ఎంతో యాక్టివ్గా ఉన్న అమితాబ్ ఈ మంగళవారం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారట. గత మూడు రోజులుగా ఆయనకి ఐసీయూ తరహా సదుపాయాలుండే గదిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాలేయ సంబంధిత వ్యాధి కారణంగానే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తుంది. అయితే రెగ్యులర్ చెకప్ కోసమే అమితాబ్ ఆసుపత్రిలో చేరారరని , ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కౌన్బనేగా కరోడ్ పతి సీజన్ 11 కార్యక్రమంతో బిజీగా ఉన్న అమితాబ్.. సూజిత్ సర్కార్ గులాబో సితాబ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. బ్రహ్మాస్త్రా అనే చిత్రంలోను కీలక పాత్ర పోషిస్తున్నారు.
నాడు 18 సీట్లు నేడు ఒక్కటి .. వర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు