telugu navyamedia
సినిమా వార్తలు

“సైరా” టీజర్ రిలీజ్ వేడుకలో ఆ ఇద్దరూ మిస్..!

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఈరోజు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా సైరా టీజర్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. అయితే “సైరా” టీజర్ రిలీజ్ ఈవెంట్ బాంబేలో భారీగానే జరిగింది. అయితే ఈ వేడుకలో ఇద్దరు మాత్రం మిస్ అయ్యారు. చిత్రయూనిట్ మొత్తం హాజరైనా కూడా నయనతార, అమితాబ్ బచ్చన్ మాత్రం కనబడలేదు. నయనతార ప్రస్తుతం రజినీకాంత్ దర్బార్ సినిమాలో నటిస్తుంది. దీనికోసం దుబాయ్ షెడ్యూల్ చేస్తుంది నయన్. ఇక అమితాబ్ కూడా ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాంతో ఆయన కూడా ఈ వేడుకకు రాలేకపోయాడు. అయితే చిరంజీవితో పాటు మిగిలిన వాళ్లు కూడా మెగాస్టార్ రోల్ గురించి మాట్లాడారు. నయనతార కూడా అక్కడ లేకపోయినా టీజర్లో మాత్రం అదిరిపోయింది. ఇందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య పాత్రలో నటిస్తుంది నయనతార.

Related posts