బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నటిస్తున్న చిత్రం జుంద్’. మరాఠీ దర్శకుడు నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించారు. ఆయన చేస్తున్న తొలి బాలీవుడ్ సినిమా ఇది. బర్సే నాగపూర్ లో స్లమ్ సాకర్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి మురికివాడల్లో నివసించే పిల్లలకు ఫుట్ బాల్ క్రీడలో మెళుకువలను నేర్పించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. టీజర్ యువకులు కొందరు కర్రలు, బ్యాట్స్, చైన్స్ పట్టుకొనె ఎవరినే కొట్టేందుకు వెళ్తున్నట్టుగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో అమితాబ్ వాయిస్ ఓవర్. బ్యాక్ గ్రౌండ్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పిల్లలను ఫుట్ బాల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దే క్రమంలో బర్సేకు ఎదురైన ఆటంకాలను అధిగమించిన తీరును తెరపై చూపించనున్నారు. ఈ సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆర్టికల్ 370 అప్రజాస్వామికం అంటున్న విజయ్ సేతుపతి