telugu navyamedia
రాజకీయ వార్తలు

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తాం: అమిత్ షా

amith shah bjp

2021లో పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో విజయం సాధిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. తాము అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని పేదరికాన్ని పారదోలుతామన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడుతూ.. దేశంలోని శరణార్థులందరికీ పౌరసత్వం ఇచ్చి తీరుతామన్నారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం వెనకడుగు వేయబోదన్నారు. సీఏఏపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ చట్టం వల్ల ఏ ఒక్కరి పౌరసత్వం పోదని అమిత్ షా స్పష్టం చేశారు.

Related posts