telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం అణచడంలో.. భారత్ కు అండగా ఉంటాం.. అమెరికా

america on kashmir terrorist attack

అమెరికా కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ ను హెచ్చరించింది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఉగ్రవాదులకు ఇస్తున్న మద్దతును పాక్ వెంటనే ఉపసంహరించుకోవాలని, వారికి ఆశ్రయం ఇవ్వడం నిలిపివేయాలని హెచ్చరించారు.

ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని నిరోధించే విషయంలో భారత్ కు అమెరికా ఎప్పుడూ అండగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related posts