telugu navyamedia
రాజకీయ వార్తలు

చెక్కులపై ట్రంప్‌ పేరు..ప్రతిపక్షాల విమర్శలు

trump usa

అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తమ దేశంలోని పేదవారిని ఆదుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెల చివరి వారంలో 2 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడాదికి 75 వేల డాలర్ల ఆదాయంలోపు ఉన్న ప్రతి ఒక్కరికి అమెరికా ప్రభుత్వం రూ.93 వేలు (1200 డాలర్లు) ఇవ్వనుంది. ఈ మేరకు ట్రంప్‌ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది.

అమెరికాలోని సంస్థల్లో ప్రజలు ఉద్యోగాలు కోల్పోకుండా ఆయా సంస్థలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రజలకు ఇవ్వనున్న చెక్కులన్నింటిపై తన సంతకం ఉండాలని ట్రంప్‌ ఆదేశించారు. దీనిపై ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఇది ట్రంప్ వేస్తోన్న కొత్త ఎత్తుగడ అని, దీని వల్ల పేదలకు డబ్బు అందడంలో ఆలస్యమవుతోందని విపక్షాలు మండిపడుతున్నారు.

ప్రజలకు డబ్బు అందించేందుకు సంబంధింత శాఖ ఉద్దీపన ప్యాకేజీ కింద ఇస్తోన్న అన్ని చెక్కులపై ట్రంప్‌ పేరును ముద్రించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. లక్షలాది మంది ప్రజలకు త్వరలోనే ఈ చెక్కులు అందనున్నాయి. చెక్కులకి ఎడమ వైపు ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ జె.ట్రంప్ పేరు ఉంటుందని వాషింగ్టన్‌ పోస్ట్ తెలిపింది.

Related posts