telugu navyamedia
సినిమా వార్తలు

పవన్ హీరోయిన్ పై చీటింగ్ కేసు

Ameesha-Patel

బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన “బద్రి”, మహేష్ బాబుకు జతగా నాని సినిమాలో నటించింది అమీషా పటేల్. అయితే గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా చీటింగ్ కేసుతో మరోసారి వార్తల్లో నిలిచింది. ముగిసిపోయిందని అంతా భావించిన ఈ వివాదం రెండేళ్ళ తరువాత మళ్ళీ తెరపైకి వచ్చింది. చీటింగ్ కేసులో కోర్టుకు హాజరుకావాల్సిందిగా అమీషాకు నోటీసులు అందాయి.

వివరాల్లోకి వెళ్తే… 2016లో ఉత్తర ప్రదేశ్ లోని ఓ రెస్టారెంట్ ఈవెంట్ లో డ్యాన్స్ చేసేందుకు ఒప్పుకున్నారు అమీషా. కానీ అనుకున్న సమయానికి అక్కడికి రాలేదు. దీంతో 11 లక్షలు అడ్వాన్స్ గా తీసుకొని అమీషా మోసం చేశారంటూ ఈవెంట్ మేనేజర్ పవన్ శర్మ ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వేడుక సమయానికి రావాలంటే 2 లక్షలు అదనంగా ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేశారని, ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయమని కోరగా… చంపేస్తామని బెదిరిస్తున్నారని ఈవెంట్ మేనేజర్ పవన్ శర్మ ఫిర్యాదులో తెలిపారు. ఇక అమీషాతో పాటు ఆమె సన్నిహితులపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు మార్చ్ 12లోగా కోర్టులో హాజరు కావాలంటూ అమీషాకు నోటీసులు జారీ చేశారు.

Related posts