ఏపీలో పంచాయితీ ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. నేతలు ప్రత్యర్థి పార్టీల పైన తమ అక్కసు వెలిబుచ్చుతూనే ఉన్నారు. అయితే తాజాగా నిమ్మగడ్డ తనకు అతీతమైన శక్తులు ఉన్నాయని భావిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ కి నష్టం కలిగించాలనే పక్షపాత ధోరణి తో నిమ్మగడ్డ ఉన్నారబు ఆయన అన్నారు. మ్యానిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, చంద్రబాబు పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ఆయన ప్రశ్నించారు. సెక్యూరిటీ సర్టిఫికెట్ లేకుండా యాప్ ని విడుదల చేసి మేము రాజ్యాంగ బద్ద వ్యవస్థ అంటే ఎవరు నమ్ముతారు? అని ఆయన అన్నారు. ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ఏకగ్రీవాలు ఎక్కువ జరిగాయని ఆపటం రాజ్యాంగ విరుద్ధం అని అంబటి పేర్కొన్నారు. నిమ్మగడ్డకు భయపడి చట్టవ్యతిరేకంగా వ్యవహరించే ఉద్యోగులను కచ్చితంగా బ్లాక్ లిస్ట్ లో పెడతామని అంబటి తేల్చి చెప్పారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారని పెద్దిరెడ్డి పై నిమ్మగడ్డ కక్ష కట్టాడని రాజ్యాంగ రక్షణ ముసుగులో వ్యక్తుల హక్కుల ఉల్లంఘన చేస్తే రాజ్యాంగ భక్షణ అవుతుందని అన్నారు. చూడాలి మరి ఈ వ్యథయాలకు నిమ్మగడ్డ ఏ విధంగా సమాధానం ఇస్తాడు అనేది.
previous post
next post