కరోనా పాజిటివ్ వచ్చినా తాను చాలా ధైర్యంగా ఉన్నానని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. చికిత్స పొందుతూ ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్ వెరిఫై అయిందని తన అఫిషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేస్తున్నానని తెలిపారు.
తనకు కరోనా వచ్చిన విషయం అందరికీ తెలిసిందేనని, అయితే కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్దల ఆశీస్సులతో కరోనాను జయించి త్వరలో మీ ముందుకు వస్తాను… ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడించారు.