రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు 43వ రోజుకు చేరుకున్నాయి. మరోవైపు, రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం తరలిస్తోందనే ఆందోళనతో మహిళా రైతు మృతి చెందింది. మందడంలో భారతి (55) అనే మహిళా రైతు రాజధానిపై ఆవేదనతో తీవ్ర అస్వస్థతకు గురైంది. నేడు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
రాజధాని కోసం భారతి కుటుంబం అర ఎకరం భూమిని ఇచ్చింది. రాజధాని ఉద్యమంలో సైతం భారతి చురుకుగా పాల్గొన్నది. ఒత్తిడిని టట్టులేక చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణంతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది.