బీజేపీ నేత సుజనా చౌదరిని ఏపీ రాజధాని రాజధాని రైతుల బృందం కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానికి భూములు ఇచ్చేసిన రైతులకు బీజేపీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.
రాజధాని తరలిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంపై రైతులు సీఎంను కలిస్తే మేలని సలహా ఇచ్చారు. ప్రకృతి విపత్తులను దృష్టిలో పెట్టుకుని రాజధానిని మార్చడం సమంజసం కాదని అన్నారు. ప్రకృతి నుంచి ఎదురయ్యే సమస్యలను ఎవరూ ఎదిరించలేరని చెప్పారు. విపత్తుల కారణంగా రాజధాని మార్చాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.