telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైకోర్టులో ఏపీ సర్కార్ కు చుక్కెదురు.. సిట్ విచారణ నిలిపేస్తూ ఉత్తర్వులు!

ap high court

అమరావతి భూముల వ్యవహారంపై హైకోర్టులో ఏపీ సర్కార్ కు చుక్కెదురైంది. సిట్ తదుపరి చర్యలను నిలిపేస్తూ కోర్ట్ ఉత్తర్వులను జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియాయమించింది. రాజధాని భూములపై దర్యాప్తుకు సిట్ ను ఏర్పాటు చేయాలని సదరు సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఈ నేపథ్యంలో సిట్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజాలు హైకోర్టును ఆశ్రయించారు. ఒక దురుద్దేశంతో ఇదంతా జరుగుతోందని తమ పిటిషన్ లో వారు ఆరోపించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం మరో ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలో సిట్ తదుపరి చర్యలు ఆపేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

Related posts