telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఇన్సైడర్ ట్రేడింగ్ విచారణ..మరో ఐదుగురిపై సీఐడీ కేసులు

amaravathi ap

అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన 106 మంది జాబితాను ఐటీ శాఖకు సీఐడీ అధికారులు మరోసారి పంపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురిపై కేసులను నమోదు చేసిన సీఐడీ అధికారులు… తాజాగా మరో ఐదుగురిపై కేసులు నమోదు చేశారు.

కృష్ణా జిల్లా విజయవాడ, పెనమలూరు, పోరంకి, యనమలకుదురు ప్రాంతాలకు చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి. తప్పుడు పత్రాల ద్వారా తెల్ల రేషన్ కార్డులు పొందిన వీరంతా రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారని కేసులు నమోదు చేశారు. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలపై సీఐడీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Related posts