telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అమరావతి నుంచి ఐదు గ్రామాల తొలగింపు

amaravathi ap

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని ఐదు గ్రామాల తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి గ్రామాలను తొలగిస్తూ తాడేపల్లి, మంగళగిరి పురపాలక సంఘాల్లో వీటిని విలీనం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రభుత్వ నిర్ణయంపై ఆ ఐదు గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. కుట్రపూరితంగానే తమ గ్రామాలను రాజధాని నగర పరిధి నుంచి తొలగించారని ఆరోపిస్తున్నారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని రైతులు తెలిపారు.

Related posts