రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ఆయన బినామీలు కోట్లు కాజేయాలనుకున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ట్రాన్స్ ఫర్ చేయకూడదు. 4070 ఎకరాలు కొన్నది చంద్రబాబు అనుచరులు కాదా?’ అని ప్రశ్నించారు. రాజధానిలో జరిగిన మోసాన్ని కచ్చితంగా బయట పెడతాం. అధికార వికేంద్రీకరణ జరగాల్సి ఉంది.
రైతుల ముసుగులో చేరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించం. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. జగన్ ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారని అంబటి అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకు అవకాశం ఉందని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సహజంగానే జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. ఐదేళ్లలో చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయలేదు. రైతుల ముసుగులో రాజకీయం చేస్తే సహించేది లేదన్నారు.
కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు: కిషన్ రెడ్డి