telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్ వెళ్లాలా?: చంద్రబాబు ఫైర్

chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిని చంపేశారని విమర్శించారు. పిల్లల భవిష్యత్తు ఏంటి? ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, విదేశాలకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. మనకంటూ ఒక రాజధాని ఉండి, మన పిల్లలు ఉద్యోగాలు చేసుకునే అర్హత మనం సంపాదించుకోలేమా అనే ఉద్దేశంతో రాజధాని అమరావతిని నిర్మిస్తే.. ఇప్పుడు దాని మీద కక్ష గట్టి ని చంపేసే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు.

ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు చాలా తక్కువ వడ్డీకే ఆ నిధులు ఇచ్చారని, ఆ నిధులను ఏపీ ప్రభుత్వం పోగొట్టిందని విమర్శించారు. ఒక పైసా అప్పు చేయకుండా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని తాను కలలు కంటే ఈరోజు ఏం చేశారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ కు ధీటుగా అమరావతి ఉండాలని తాను ప్రణాళికలు తయారు చేస్తే, ఎన్నికలు అయిన తర్వాత ఏమైందో ప్రజలే చూస్తున్నారనిచంద్రబాబు అన్నారు.

Related posts