telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్ర ప్రజలు కోరుకున్న రీతిలో రాజధాని: ఏపీ మంత్రి బొత్స

వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా మంచి రాజధానిని దీన్ని నిర్మిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వైజాగ్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో సంబంధించింది కాదని, ఐదు కోట్ల ప్రజానీకానికి సంబంధించిందనిఅన్నారు.

రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్న రీతిలో ఈ రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు. రాజధాని కోసం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ రాష్ట్ర మంతటా పర్యటిస్తుందని తెలిపారు. అక్కడి పరిస్థితులను బేరీజు వేస్తుందని, ప్రజల మనోభావాలను తెలుసుకుంటుందని అన్నారు. రాజధానిగా ఏ ప్రాంతాన్ని అయితే ఆ కమిటీ సభ్యులు నిర్ణయిస్తారో దాని ప్రకారం ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని నిర్ణయించుకుందని స్పష్టం చేశారు.

Related posts