telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వారి నిర్ణయం తర్వాతే రాజధానిపై స్పందిస్తాం: పవన్ కల్యాణ్

pawan-kalyan

ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని విషయం పై జనసేన పార్టీ అచితూచి స్పందిస్తోంది. జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు చెబుతున్నారని, వారి నిర్ణయం తర్వాతే తాము మాట్లాడతామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

కేబినెట్ తీసుకునే నిర్ణయాన్ని తాము జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చిస్తామని వెల్లడించారు. అభివృద్ధి అంటే నాలుగు భవనాలు కాదని, అభివృద్ధి అంటే సంపద సృష్టించే వనరులను ఏర్పాటుచేయాలని పవన్ స్పష్టం చేశారు. ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరిచే అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందని పవన్ పేర్కొన్నారు.

Related posts